www.viraltelugu.com, Online News : ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. 2023కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బాలీవుడ్ చిత్రం ’12th’ ఉత్తమ జాతీయ చిత్రంగా ఎంపికైంది. ఇందులో హీరోగా నటించిన విక్రాంత్ మసాయ్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) స్వీకరించారు.

టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపిక కాగా.. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు అందుకున్నారు. సాయి రాజేశ్ (ఉత్తమ స్క్రీన్ప్లే- బేబీ సినిమా), పీవీఎన్ఎస్ రోహిత్ (ఉత్తమ నేపథ్య గాయకుడు- బేబీ మూవీ), ప్రశాంత్ వర్మ (హనుమాన్ సినిమా.. బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్) హర్షవర్ధన్ రామేశ్వర్ (ఉత్తమ నేపథ్య సంగీతం- యానిమల్ మూవీ), సుకృతి వేణి (ఉత్తమ బాల నటి- గాంధీతాత చెట్టు) తదితరులు అవార్డులు పొందారు. ఊరూ పల్లెటూరు(బలగం) పాటకు బెస్ట్ లిరిక్స్ అవార్డును కాసర్ల శ్యామ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

ఇదే వేడుకలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్లాల్కు ప్రదానం చేశారు. అంతకుముందు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ.. ‘దాదా ఫాల్కే పురస్కారాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. అంతా మ్యాజిక్ అనిపిస్తోంది. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ పురస్కారం నా ఒక్కడికే కాదు ఇది మలయాళ సినీ పరిశ్రమకు చెందుతుంది. మరింత బాధ్యతగా పనిచేస్తా.’ అని పేర్కొన్నారు.



