Friday, November 14, 2025
spot_img
Homeక్రీడలువరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. ఫైనల్‌పై ఫోకస్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. ఫైనల్‌పై ఫోకస్

www.viraltelugu.com, Online News : ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్‌పై దృష్టి సారించింది. సూపర్‌-4లో భాగంగా ఈరోజు సాయంత్రం తన రెండో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన సూర్య కుమార్‌ సేన ఈ పోరులో గెలిస్తే ఫైనల్లో చోటు ఖాయమే. అటు బంగ్లా కూడా శ్రీలంకపై విజయంతో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. కానీ, గణాంకాలను పరిశీలిస్తే టీమిండియాకు ఇది కూడా ఏకపక్ష మ్యాచ్‌గానే పరిగణించవచ్చు. ఎందుకంటే బంగ్లాతో ఆడిన 17 టీ20ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడింది. ఏ విభాగంలో చూసినా ప్రత్యర్థి కన్నా భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గత రికార్డులు ఎలా ఉన్నా భారత్‌ను ఓడించగల సత్తా తమ జట్టుకు ఉందని బంగ్లాదేశ్‌ కోచ్‌ సిమన్స్‌ అంటున్నారు.

మరోవైపు సూపర్‌-4లో పాకిస్థాన్‌ కీలక విజయం అందుకుంది. ఫైనల్‌ రేసులో నిలవాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హుస్సేన్‌ తలత్‌ నిలిచాడు. ఈ ఓటమితో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక ఆసియాకప్‌నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే.

Admin
Admin
Viral Telugu is news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments