Viral Telugu

నేడు హిందీ భాషా దినోత్సవం

జాతీయోద్యమంలో దేశ ప్రజలను జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష దోహదపడింది. అటు తర్వాత జాతీయ భాషగా గుర్తింపు పొందింది.1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. నాటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నేడు హిందీ దివస్ సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనం.. 1949లో భారత రాజ్యాంగ సభ ద్వారా హిందీని అధికారిక భాషగా…

Read More

శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర మరోసారి వాయిదా

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి యాత్రకు ఆటంకాలు తప్పడం లేదు. భారీ వర్షాల కారణంగా యాత్రను తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు టెంపుల్ బోర్డు శనివారం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14 నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ‘భవన్ ట్రాక్ వద్ద ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున 14వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వైష్ణోదేవి యాత్రను మరోసారి వాయిదా వేస్తున్నాం.’ అని శ్రీ…

Read More

బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

యునైటెడ్ కింగ్ డమ్ లివర్ పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలిచారు. కజకిస్థాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో మీనాక్షి ఓడించారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్‌లో బంగారు పతకం సాధించింది. కాగా బాక్సింగ్  విభాగంలో భారత్…

Read More

అస్సాంలో 5.8 తీవ్రతతో భారీ భూకంపం

అస్సాం రాష్ట్రంలో  భూకంపం సంభవించింది. ఈరోజు(ఆదివారం) సాయంత్రం 4:41 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ఉదల్‌గిరి జిల్లాలోని ధెకియజులి ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, చైనాలోనూ భూ…

Read More

స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో చేరిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌’లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది. 16 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ప్రచారం.. మహిళల ఆరోగ్యం, పలు వ్యాధులకు స్క్రీనింగ్‌పై దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, ఆయుష్ పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంఘాలు, NGOలు వంటి ఇతర వాటాదారుల సహకారంతో…

Read More

పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్‌మెంట్‌ ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల…

Read More

దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర…

Read More