Thursday, January 1, 2026
spot_img
Homeఆంధ్రప్రదేశ్తిరుమలలో ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుమలలో ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

www.viraltelugu.com, Online News : తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలనూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలన్నారు. 

శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృతిమ మేధస్సును (ఏఐ) వినియోగించనుంది. ఎన్‌ఆర్‌ఐల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ రెడీ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ అధునాతన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనిచేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3డీ మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు సహరించనుంది. అలిపిరి నుంచి తిరుమల వరకూ భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణతో పాటు టెక్నాలజీ సాయంతో స్వామి వారి దర్శనం జరిగేలా ఎప్పటికప్పుడు సూచనలు చేయనుంది.

Admin
Admin
Viral Telugu is news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments