దసరా ఉత్సవాలకు 4,500 మందితో పోలీసులతో భద్రతా ఏర్పాట్లు

Dasara

విజయవాడ  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు 4,500 మందితో పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వి.అనిత తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి   అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈసారి దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు. వెయ్యి కి పైగా సిసి కెమేరాలతో పాటు హ డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నామని, భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Share Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *