www.viraltelugu.com, Online News : తమిళనాడులోని కరూర్ దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ వేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. విజయ్ పిటిషన్కు సంబంధించి మదురై బెంచ్ ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం టీవీకే పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ దశలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి.. దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. మరోవైపు రాజకీయ పార్టీలకు కోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.



